తెలుగు భాషాప్రయుక్త రాష్ట్రానికి యాబది సంత్సరాలు నిండిన సందర్భముగా,ఆంధ్రభాషా(తెలుగు) ప్రాచుర్యంపై నా మిత్రుడు వాసవ్య వాళ్ళ నాన్న గారు ఇటీవల ఒక కవిత వ్రాసారు.అది మీకు నచ్చుతుందని భావిస్తున్నాను.

వేయి జిహ్వలు చాలవు నిను పొగడగ
భూమి భాషల మృదు మధుర ధ్వనుల
భారతీ ఒడిలోన మురిపెముల చిన్నారివై
తేనెలూరించు సొబగుల తెనుగు తల్లీ !

ప్రాచీన గీర్వాణ గంభీర పద బంధన
పౌరాణికేతిహాస భావనాడోల లూపిన
నన్నయాది కవి గురువుల కన్న తల్లీ
నీ సంస్కృతీ ప్రాభవాల న్నిల్పు తల్లీ !

ప్రబంధ కావ్య మదగజమన రీతుల
ప్రజాపతుల డోలలూగించి నీసౌందర్య
లహరినలరించి నీదు సంస్కృతీ నందనం
చాటిన పెద్దనాది కవులకన్న తల్లీవందనం!

నీకాటుక కంటినీరు జారు వార
విలవిలలాడి నీదు కన్నీరు తుడచి
ఓదార్చి నీ పవిత్ర ఆత్మగౌరవమ్ము
కాచిన పోతనాది ప్రజా కవులకు జేజేలు !

నీదు చైతన్య స్ఫూర్తీ విజ్ణాన వీచికలు
నీతి సూత్ర ఆధునిక సంస్కరణలు
హేతు విజ్ణాన మాంధ్రుల దోచిటపోసిన
పరవస్తు కందుకూరి గురజాడలకు జోహార్లు !

పారతంత్ర్యము పారద్రోలి స్వాతంత్ర్యమ్ము
సాధించిన భరతమాత ముద్దు బిడ్డలు
పరభాషావ్యామోహాన భరత భాషల
అల క్ష్మిం చు నీదు బిడ్డల మేలుకొల్పు !

“దేశభాషలందు తెలుగులెస్స” ఘనకీర్తి
కాదు దశకోటి ఆంధ్రుల చిరకాలకోర్కె
నీదుపేర విశాలాంధ్ర కై ప్రణత్యాగమొనర్చి
భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధించిన ప్రజాకోటి
పోట్టి శ్రీరాముల గన్న తల్లీ నీకిదే వందనం !

ఆంధ్ర రాష్ట్రావతరణతో శ్వాస పీల్చి
ఆభ్యుదయ విప్లవ సాహిత్య ప్రక్రియలు
నీదు సామాన్య ప్రజల చైతన్య పరచిన
రాయప్రోలు దాశరధి ఆరుద్ర శ్రీశ్రీలకు జేజేలు!
శ్రీశ్రీ ఇత్యాది కవుల నీ సాహిత్య ప్రభావ

జనితా ప్రజ సాహిత్య పరవళ్ళఅతో
సమ సమాజ ధ్యేయ యువ కవితా
కిశోర్ల కన్న తెలుగు తల్లీ నీకిదే వందనం !

తెలుగు భాషా సంస్కృతి ప్రచార యాత్ర కొరకు

శుభాభినందనలతో…

యాగాటి కనకారావు, ఏలూరు.

Popularity: 1% [? ]

Tags: , ,

Posted in Telugu | 3 Comments

Related Entries

    No related posts